నటి మాధవీలత ఫిర్యాదులో ఏముందో తెలుసా..

టాలీవుడ్ నటి మాధవీలత వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో, ఆమె సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిశారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లిన మాధవీలత ఫిర్యాదు చేశారు. 

Last Updated : Feb 10, 2020, 07:27 PM IST
నటి మాధవీలత ఫిర్యాదులో ఏముందో తెలుసా..

హైదరాబాద్ : టాలీవుడ్ నటి మాధవీలత వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో, ఆమె సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిశారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లిన మాధవీలత ఫిర్యాదు చేశారు. దీనిపై మాధవి లత సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలిశానని, తనపై వస్తున్న వేధింపులకు సంబంధించి రెండు ఫిర్యాదులు చేశానని నటి మాధవి లత వెల్లడించారు. 

పిర్యాదు చేసిన వాటిలో ఒకటి తన వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించినది కాగా, మరొకటి సోషల్ మీడియాలో తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ దూషించడానికి సంబంధించినదని ఆమె వివరించారు. మానసికంగా తనను దెబ్బతీసేలా, నా వ్యక్తిత్వాన్ని గాయపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వృత్తిని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్నారని మాధవి లత ఆరోపించారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News