రామ జన్మభూమిపై రాజకీయాలు మానుకోవాలని కేసీఆర్ హితవు

                                                                  

Last Updated : Apr 2, 2019, 08:04 PM IST
రామ జన్మభూమిపై రాజకీయాలు మానుకోవాలని కేసీఆర్  హితవు

భుమనగిరి సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ రామ జన్మభూమి అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ....మన నాయకులు మాట్లాడితే రామజన్మ భూమి అంటారు.. అసలు రాజకీయ నాయకులకు రామజన్మ భూమితో పనేంటి ?...రామ జమ్మ భూమి అంశం గురించి రాజకీయ నాయకులకు ఎందుకు ?..దాని గురించి మాట్లాడటానికి మఠాథిపతులు ఉన్నారు కదా...అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు.

నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడాలి ..

రాజకీయ నాయకులు అంటే ప్రజా సమస్యలపై మాట్లాడాలి... రైతుల సమస్యలపై చర్చించాలి.. కానీ మన దౌర్భాగ్యం ఏటంటే ఎన్నికల వేళ  సున్నిత అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ నేతలు గోల్ మాల్ చేస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు మనకు అవసరమా అంటూ జనాలను కేసీఆర్ ప్రశ్నించారు

Trending News