Telangana: కరోనా వైరస్ బారి నుంచి 2 లక్షల మంది కోలుకున్నారు

కరోనా వైరస్ (CoronaVirus Cases In Telangana) వ్యాప్తి తెలంగాణలోనూ కొనసాగుతోంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Last Updated : Oct 19, 2020, 08:57 AM IST
Telangana: కరోనా వైరస్ బారి నుంచి 2 లక్షల మంది కోలుకున్నారు

తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 948 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases in Telangana) నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,23,059కి చేరింది. గత వారం కిందటి వరకు నమోదైన ఒక్కరోజు కేసులతో పోల్చితే తాజాగా నమోదైన కేసులు స్వల్పంగా ఉన్నాయి. నిన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 212 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. 

 

ఆదివారం ఒక్కరోజే కరోనాతో పోరాడుతూ నలుగురు చనిపోయారు. దీంతో తెలంగాణలో మొత్తం కోవిడ్19 (COVID19) మరణాల సంఖ్య 1,275కి చేరుకుంది. కరోనాకు చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్న వారి సంఖ్య తెలంగాణలో 2,00,068కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,091 యాక్టివ్ కరోనా కేసులుండగా, అందులో 17,432 మంది హోం ఐసోలేషన్‌లో డాక్టర్ల సలహాలు, సూచనలతో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News