Telangana Corona cases: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 195 మందికి పాజిటివ్​

Telangana Corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 195 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 09:45 PM IST
  • తెలంగాణలో స్వల్పంగా పెరిగన కరోనా కేసులు
  • కొవిడ్ కారణంగా ఒకరు మృతి
  • రాష్ట్రంలో 98.84 శాతంగా రికవరీ రేటు
Telangana Corona cases: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 195 మందికి పాజిటివ్​

Telangana Corona cases: తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 195 కేసులు (Corona cases in Telangana) బయటపడ్డాయి. ఒకరు కొవిడ్ కారణంగా మృతి చెందారు. 171 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలంగాణ ఆరోగ్య విభాగం వెల్లడించింది.

టెస్టులు ఇలా..

గడిచిన 24 గంటల్లో 37,108 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది (Corona testes in Telangana) ఆరోగ్య విభాగం. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,88,01,263 కొవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇంకా 1,720 పరీక్షల ఫలితాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్రంలో సగటున 10 లక్షల మందిలో 7,73,811 జనాభాకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మొత్తం కేసులు ఎన్ని?

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,77,138 కరోనా కేసులు (Total Corona cases in Telangana) నమోదయ్యాయి. అందులో 6,69,328 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,810 యాక్టివ్​ కరోనా కేసులు (Corona active cases in Telangana) ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.84 శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.59 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వ అధికారిక గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని వివరాలు..

ఒమిక్రాన్ భయాలతో ఎయిర్​పోర్ట్​లో టెస్టులు తప్పనిసరి చేసిన తర్వాత.. ఇప్పటి వరకు 1805 మంది ఒమిక్రాన్​ రిస్క్​ అధికంగా ఉన్న దేశాల నుంచి హైదరాబాద్​కు వచ్చినట్లు ఆరోగ్య విభాగం తెలిపింది. అందులో 13 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు వెల్లడించింది.

నేడు (సోమవారం) 535 మంది హైదరాబాద్ చేరుకోగా.. ఒక్క కేసు కూడా నమోదవలేదని పేర్కొంది ఆరోగ్య విభాగం. అయితే పాజిటివ్​ వచ్చిన వారిలోనూ ఎవరికి కూడా ఒమిక్రాన్ సోకలేదని నిర్ధారణ అయినట్లు స్పష్టం చేసింది.

Also read: Road Accident: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం... దంపతుల మృతి...

Also read: MP Revanth Reddy: 'టీఆర్​ఎస్ ఎంపీలు హైదారాబాద్ వచ్చేస్తున్నారు.. పార్లమెంట్​కు హాజరు కారు'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News