బ్రేకింగ్ న్యూస్: ప్రణయ్‌ను నరికి చంపిన వ్యక్తి అరెస్ట్

                    

Last Updated : Sep 18, 2018, 06:14 PM IST
బ్రేకింగ్ న్యూస్: ప్రణయ్‌ను నరికి చంపిన వ్యక్తి అరెస్ట్

నల్గొండ: ఎట్టకేలకు ప్రయణ్ హత్య కేసు నిందితుడు పట్టుబడ్డారు. బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో సంచరిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అమృత తండ్రి మారుతీరావు నుంచి సుపారీ తీసుకుని ప్రణయ్ ను హతమార్చిన వ్యక్తి పేరు సుభాష్ శర్మ. ఇతను బీహార్  ప్రాంతానికి చెందిన వ్యక్తి. ప్రణయ్ ను హతమార్చిన వెంటనే అతను మిర్యాలగూడ నుంచి బీహార్ కు పరారయ్యాడు. విచారణలో భాగంగా  నల్గొండ నుంచి వెళ్లిన పోలీసులు ..బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో అతడిని మంగళవారం అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం నిందితుడిని బీహార్ నుంచి నల్గొండకు తరలిస్తున్నారు. సాయంత్రం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

కూతురు అమృత పెళ్లాడినందుకు అమృత తండ్రి మారుతీరావు స్కెచ్ వేసి ప్రయణ్ ను చంపినట్లు పోలీసులు విచారణలో తేలిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం ప్రయణ్ ను హతమార్చేందుకు మామ మారుతీరావు బీహార్ కు చెందిన సుభాష్ శర్మతో డీల్ చేసుకున్నాడు. ఈ క్రమంలో మారుతీరావు నుంచి సుపారీ తీసుకుని ప్రణయ్ ను సుభాష్ శర్మ హతమార్చి బీహార్ కు పరాయ్యాడు. ఇలా పరారీలో ఉన్న నిందితుడి కోసం బీహార్ వెళ్లిన పోలీసులు మంగళవారం అతన్ని సమస్తీపూర్ ప్రాంతంలో పట్టుకున్నారు.

Trending News