తొలిటెస్ట్: వర్షం అడ్డంకి.. మ్యాచ్ నిలిపివేత

  ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్ - శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ వెలుతూరు సరిగా లేదు.. దీనికి తోడు వర్షం కూడా మధ్య మధ్యలో అడ్డుతగులుతూ వస్తోంది. దీంతో మ్యాచ్ ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..

Last Updated : Nov 16, 2017, 03:39 PM IST
తొలిటెస్ట్: వర్షం అడ్డంకి.. మ్యాచ్ నిలిపివేత

కోల్ కతా:  ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్ - శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. మ్యాచ్ ప్రారంభమైనప్పటినుంచి వెలుతూరు సరిగా లేదు.. దీనికి తోడు వర్షం కూడా మధ్య మధ్యలో అడ్డుతగులుతూ వస్తోంది. దీంతో మ్యాచ్ ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..

అంతకుముందు ఉదయం టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 8.2 ఓవర్లు ఎదుర్కొని రెండు వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది. ఓపెనర్లు లోకేష్ రాహుల్ 0.. ధావన్ 8 పరుగులు వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం పుజారా 8 పరుగులు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Trending News