Viral News: స్మశానంలో ఇదేం ట్విస్ట్ రా నాయన.. దహన సంస్కారాల ముందు కళ్లు తెరిచిన మహిళ.. ఎక్కడంటే..?

Odisha: ఇంట్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగటంతో మహిళ తీవ్ర గాయాలపాలైంది. ఆమెను టెస్ట్ చేసిన వైద్యులు ఆమెకు ట్రీట్మెంట్ అందించారు. ఈక్రమంలో ఆమె మాట్లాడకుండా కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె శరీరం నుంచి ఎలాంటి కదలిక గానీ, ఉలుకు పలుకు గానీ లేదు.   

Written by - Inamdar Paresh | Last Updated : Feb 15, 2024, 12:56 PM IST
  • - డాక్టర్ సర్టిఫికేట్ లేకుండానే అంతిమ సంస్కారాలు..
    - స్మశానంలో లేచి కూర్చున్న మహిళ..
Viral News: స్మశానంలో ఇదేం ట్విస్ట్ రా నాయన.. దహన సంస్కారాల ముందు కళ్లు తెరిచిన మహిళ.. ఎక్కడంటే..?

Dead Woman Opens Eyes Minute Before Cremation: కొన్నిసార్లు నిజ జీవితంలో అస్సలు ఊహించని ట్విస్ట్ లు జరుగుతుంటాయి.  ఏదైన ప్రమాదాలలో గాయపడిన వారు , కొన్నిసార్లు కోమాలోకి వెళ్తుంటారు. సంవత్సరాల తరబడి కూడా కోమాలోనే ఉంటారు. కొన్నిసార్లు.. శరీరంలో కదలిక లేకపోవడంతో, ప్రాణం పోయిందనుకొని అంతిమ సంస్కారాలు చేయడానికి సిద్ధమైపోతుంటారు.

Read More: Mouni Roy: 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ కొత్త అవతారం.. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా..

ఇంతలో ఏదో మ్యాజిక్ జరిగినట్లు పోయారనుకున్న వాళ్లలో ఏదో కదలిక వస్తుంది. ఇలా చాలా సంఘటనలు తమ వారు పోయారనుకున్న వాళ్లు, తిరిగి లేచి కూర్చున్నారు. కొన్నిసార్లు డాక్టర్లు తప్పిదాలుంటే.. మరికొన్నిసార్లు బాధితుల బంధువుల పొరపాట్ల వల్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం ఒడిశా లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాలు..

ఒడిశాలోని బెర్హంపూర్‌లో దహన సంస్కారాలకు ముందు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మరికొన్ని నిమిషాల్లో దహన సంస్కారాలు ఉందనగా సదరు మహిళ లేచీ కూర్చుంది. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా షాకింగ్  కు గురయ్యారు.
స్థానికుల ప్రకారం.. ఒడిశాలోని  బెర్హంపూర్ పట్టణంలో ఓ 52 ఏళ్ల మహిళ తన ఇంట్లో ఉండగా అగ్ని ప్రమాదం జరిగింది.  ఫిబ్రవరి 1 న ఆమె ఇంట్లో మంటలు చెలరేగాయి. వెంటనే ఆమెను బంధువులు, స్థానికులు..    MKCG మెడికల్  ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు 50 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.

ఆ తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ అందించి డిశ్చార్జ్ చేశారు. మెరుగైన వైద్యం కోసం.. మరో ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అయితే, డబ్బు లేకపోవడంతో ఆమె భర్త ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఆమె జీవితంతో పోరాడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. “గత సోమవారం, ఆమె కళ్ళు తెరవడం లేదు.  ఆమె శ్వాస తీసుకోవడం లేదు. ఆమె చనిపోయి ఉండవచ్చని భావించారు ఈ క్రమంలోనే  స్థానికులకు సమాచారం ఇచ్చారని ఆమె భర్త సిబారామ్ పాలో చెప్పారు. ఈ  క్రమంలో అంత్యక్రియలను ఏర్పాటు చేశారు.

Read More: Priyamani - Bhamakalapam 2: ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న 'భామా కలాపం 2' ట్రైలర్.. ఫిబ్రవరి 16న ఆహాలో స్ట్రీమింగ్..

ఇంతలో ఆమె చితిమీద ఉండగా శరీరంలో కదలిక వచ్చింది. అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. ఆమె బతికే ఉన్నట్లు గుర్తించారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. మహిళ కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించకుండానే అంతిమ సంస్కారాలకు రెడీ అయిపోయారు.  బెర్హంపూర్ మునిసిపల్ కార్పోరేషన్ యొక్క శవ వాహనంలో బిజీపూర్‌లోని సమీపంలోని శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేశారు. దీనిపై లోకల్ కార్పొరేటర్ కు సమాచారం ఇచ్చారు. ఆతర్వాత మహిళను ఆస్పత్రికి తరలించారు. ఈ  ఘటన పై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News