New Parliament Building Inauguration: కొత్త పార్లమెంట్ లోపలి చిత్రాలను చూశారా..? ఆసక్తికర విషయాలు ఇవిగో..!

New Parliament Building Inside Pics: అత్యాధునిక వసతులు, అద్భుతమైన డిజైన్‌తో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభంతో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. పార్లమెంట్ భవనం లోపలి చిత్రాలు, ప్రత్యేకతలపై ఓ లుక్కేయండి..

1 /7

పార్లమెంట్ భవన నిర్మాణంలో దేశంలోని అనేక ప్రాంతాల వస్తువులను ఉపయోగించారు. ఎర్రకోట, హుమాయూన్ సమాధి కోసం ఉపయోగించిన ఇసుకరాయిని కొత్త పార్లమెంటు నిర్మాణంలో వాడారు.   

2 /7

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నుంచి తివాచీలు, త్రిపుర నుంచి వెదురు, రాజస్థాన్ నుంచి రాతి శిల్పాలు పార్లమెంట్‌ భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. టేకు కలపను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి తీసుకురాగా.. ఎరుపు, తెలుపు ఇసుకరాయి రాజస్థాన్‌లోని సర్మతుర నుంచి తీసుకువచ్చారు.   

3 /7

కుంకుమపువ్వు ఆకుపచ్చ రాయిని ఉదయపూర్ నుంచి, రెడ్ గ్రానైట్ అజ్మీర్ సమీపంలోని లఖా నుంచి, అంబాజీ రాజస్థాన్ నుండి తెల్లని పాలరాయిని సేకరించారు. ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించడానికి దేశం మొత్తం కలిసి వచ్చిందని.. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అధికారులు చెబుతున్నారు.   

4 /7

లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్‌లలో 'ఫాల్స్ సీలింగ్' కోసం స్టీల్ నిర్మాణం కేంద్రపాలిత ప్రాంతం డామన్, డయ్యూ నుంచి తీసుకువచ్చారు. అయితే కొత్త భవనం కోసం ఫర్నిచర్ ముంబై నుంచి తీసుకువచ్చారు. భవనంపై ఉన్న రాయి 'జలి' రాజస్థాన్‌లోని రాజ్‌నగర్, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నుంచి సేకరించారు.  

5 /7

అశోక చిహ్నానికి సంబంధించిన మెటీరియల్‌ను మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి సేకరించారు. పార్లమెంట్ భవనం వెలుపలి భాగాలకు సంబంధించిన సామగ్రిని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి తీసుకువచ్చారు. రాతి చెక్కడం పనిని అబు రోడ్, ఉదయపూర్ శిల్పులు చేశారు. రాళ్లను రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ నుంచి తీసుకువచ్చారు.  

6 /7

హర్యానాలోని చర్కి దాద్రీ నుంచి తయారైన ఇసుక లేదా 'అమ్రెట్' కొత్త పార్లమెంట్ భవనంలో నిర్మాణ కార్యకలాపాల కోసం కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేయడానికి ఉపయోగించారు.    

7 /7

పార్లమెంట్ నిర్మాణంలో ఉపయోగించిన 'ఫ్లై యాష్' ఇటుకలు హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి సేకరించారు. ఇత్తడి, 'రెడీమేడ్ అచ్చులు' గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి తీసుకువచ్చారు.