Kriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..

Kriti sanon Relationship: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తన కంటే పదేళ్ల చిన్నోడితో డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీనిపై తాజాగా, తొలిసారి బాలీవుడ్ నటి నోరు విప్పారు.

1 /7

సాధారణంగా  సినిమారంగం, పొలిటిషియన్స్ ల వ్యక్తిగత జీవితాల మీద తరచుగా రూమర్స్ వస్తుంటాయి. ఇక అందమైన హీరోయిన్స్ ల విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడకు వెళ్లిన, ఏం చేసిన కూడా పెద్ద తప్పే. సోషల్ మీడియాలో వాళ్ల చేస్తున్న ప్రతిపనిని చాలా మంది ట్రోల్స్ చేస్తుంటారు.  

2 /7

ఇటీవల ట్రోల్స్ వల్ల చాలా మంది హీరోయిన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హీరోయిన్స్ ల పర్సనల్ లైఫ్ ల మీద ఇష్టమోచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు కొన్ని సైట్ లలో.. కూడా హీరోయిన్స్ గురించి ఇష్టమున్నట్లు థంబ్ నైట్ పెట్టేసి, వారి ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు.ఈ నేపథ్యలో మరో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ట్రోల్స్ కు గురయ్యారు. 

3 /7

కృతి సనన్ తనకంటే పదేళ్లు చిన్నవాడైన .. యూకే కు చెందిన బిజినెస్ మెన్ కబీర్ దహియాతో రిలేషన్ లో ఉన్నారని కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై నటి కృతి సనన్ తాజాగా ఫైర్ అయ్యారు. డేటింగ్‌ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్‌ తనను ఎంతో బాధించాయని నటి చెప్పుకొచ్చింది.  

4 /7

వైరల్ గా మారిన ఈ రూమర్స్ లో నిజంలేదని, ఇలాంటి పనులు చేయడం మానుకొవాలని చురకలంటించింది.ఈ డేటింగ్ రూమర్స్ లను ఖండించిన నటి.. వీటి వల్ల తన ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతోందని కూడా ఎమోషనల్ అయ్యింది.  

5 /7

తన గురించి తప్పుడు సమాచారాన్ని రాసినప్పుడు నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్​ కూడా ఇబ్బందులు పడతారు. దీంతో మేమంతా సఫర్ అవుతాం.  సోషల్‌ మీడియా ద్వారా ఇట్టే త్వరగా ప్రజల్లోకి వెళ్లిపోతాయి. అవి నిజం అనుకుని చాలా మంది నాకు మెసేజ్‌లు చేస్తుంటారు. వీటిపై రెస్పాండ్ కావాలంటేనే అసహ్యంగా ఉంటుందని కూడా నటి ఆవేదన వ్యక్తం చేసింది..

6 /7

'34 ఏళ్ల కృతి తన కన్నా 10 ఏళ్ల చిన్న వ్యక్తితో డేటింట్ అంటూ  చాలా సైట్ లలో హెడ్డింగ్​ను రాశారు. ఏ మాత్రం అందులో నిజమెంత అని తెలుసుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు రాశారు. ఇదేంత వరకు కరెక్ట్ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం, అవతలి వ్యక్తిపై రూమర్స్‌ క్రియేట్‌ చేయడం రెండూ ఒకటి కాదంటూ కృతి అసహనం వ్యక్తం చేసింది.

7 /7

మహేశ్​ 'వన్- నేనొక్కడినే', నాగ చైతన్య 'దోచెయ్', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని  బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కట్టిపాడేశారు. ఇటీవలే 'క్రూ' చిత్రంతో విజయాన్ని అందుకుంది కృతిసనన్. అలానే 2021లో విడుదలైన ‘మిమీ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది.