Priyanka Gandhi: ప్రియాంక గాంధీ సభకు భారీగా పోటెత్తిన జనం.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్

Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముహూర్తం దగ్గరపడుతోంది. మరో ఆరు రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారం ఉధృతిని మరింత పెంచాయి. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచార సభలతో బిజీగా ఉన్నారు. కల్బుర్గిలో ఆమె సభకు భారీ జనం పోటేత్తారు.
 

1 /5

కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టదలతో ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు బలంగా సంకేతాలు పంపించొచ్చని భావిస్తోంది.

2 /5

గత ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది తాత్కలికంగానే నిలిచింది. అందుకే ఈసారి సంపూర్ణ మెజారిటీ సాధించాలని చూస్తోంది.  

3 /5

బీజేపీ నుంచి కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుని మరింత బలంగా ప్రచారం రంగంలో దూసుకెళుతోంది.    

4 /5

ప్రియాంక గాంధీ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్‌ కనిపించింది. దారి పొడవునా ఆమెకు ఘన స్వాగతం పలికారు.  

5 /5

తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు ప్రియాంక గాంధీ. ఓటుతో బీజేపీకి బుద్ధి చెప్పి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరారు.