IND vs ENG: వ్యాక్సిన్‌పై సందేహాలు వద్దంటున్న ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ

  • Jan 31, 2021, 19:06 PM IST

 

IND vs ENG: ఇండియా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో రెండు జట్లు విధిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయిస్తోంది బీసీసీఐ. అటు కోవిడ్ వ్యాక్సిన్ అంశంపై ఇంగ్లండ్ క్రికెటర్ మొయీన్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

1 /5

మొయీన్ అలీ పాకిస్తాన్ మూలాలకు చెందిన ఇంగ్లండ్ పౌరుడు. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌తో పాటు శీలంక టూర్‌కు వచ్చినప్పుడు ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ తరువాత ఆయన 13 రోజులు క్వారెంటైన్‌లో గడిపారు.

2 /5

బ్రిటన్‌లోని ముస్లిం లీడర్లు ప్రజలకు వ్యాక్సిన్ పట్ల నమ్మకం కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మొయీన్ అలీ తన వంతు ప్రయత్నంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వర్గంలో వ్యాక్సిన్ పట్ల సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. 

3 /5

ఇతర వ్యాక్సిన్ లాంటిదేనని మొయీన్ అలీ తెలిపారు. ఈ వ్యాక్సిన్ విషయంలో పుకార్లు వస్తున్నాయని కానీ దానిపై దృష్టి పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాలని సూచించారు. 

4 /5

వర్చ్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మొయీన్ అలీ వ్యాక్సిన్‌పై వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ గురించి తెలిసినవారితో తాను మాట్లాడానని..అందుకే ఈ మాటలు చెబుతున్నానన్నారు. తాను, తన కుటుంబం కూడా వ్యాక్సిన్ తీసుకుంటుందని చెప్పారు. 

5 /5

వ్యాక్సిన్ విషయంలో నెలకొన్న పుకార్లను నమ్మవద్దని..అందరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని మొయీన్ అలీ సూచిస్తున్నారు. ఆయన వర్గానికి చెందినవారు చాలా తక్కువ మంది వ్యాక్సిన్ వేసుకోవడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే భయం కారణంగా ఆ వర్గం వ్యాక్సిన్‌కు దూరంగా ఉంది.