Glammons Mrs India 2024 award winner: హైదరాబాద్ బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన గ్లామన్ మిసెస్ ఇండియా విజేత హేమలత రెడ్డి..

Glammons Mrs India 2024 award winner: జెమినీ టీవీ యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించిన హేమలత రెడ్డి తాజాగా విదేశాల్లో జరిగిన గ్లామన్ మిసెస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి సంచలనం రేపింది. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన దసరా, బతుకమ్మ వేడుకల్లో సందడి చేసింది.

1 /5

హైదరాబాద్ లోని ఏ పి ఆర్ ప్రవీన్స్ లగ్జరియస్ విల్లాస్, పటాన్ చెరువు, గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన దాండియా వేడుకల్లో ఎంతో ఉత్సాహాంగా  హేమలత రెడ్డి పాల్గొన్నారు

2 /5

జెమినీ టీవీ యాంకర్ గా చేసి. ‘నిన్ను చూస్తూ’ సినిమాతో హీరోయిన్ గా  పరిచయమైంది  హేమలత రెడ్డి.  ఇటీవలే ఈమె గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు అందుకుంది. అంతేకాదు బెస్ట్ టాలెంట్, బెస్ట్ ఫోటోజెనిక్ విభాగాల్లో కూడా అవార్డును అందుకున్నారు.

3 /5

కాగా బతుకమ్మ పండగ నేపథ్యంలో హైదరాబాదులో చాలాచోట్ల దాండియా వేడుకలు భారీగా జరిగాయి.  అందులో హీరోయిన్ హేమలత రెడ్డి ఎంతో ఉత్సాహాంగా పాల్గొన్నారు. అంతేకాదు అక్కడ నివసించే వాళ్లతో కలిసి బతుకమ్మ ఆడారు.

4 /5

ఏ పి ఆర్ ప్రవీన్స్ లగ్జరియస్ విల్లాస్, పటాన్ చెరు, గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన దాండియా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు హేమలత రెడ్డి.

5 /5

గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలిచిన తర్వాత ఆమె పాల్గొన్న ఈ ఈవెంట్లో  అందరూ ఆమెని ప్రతిభను ప్రశంసించారు. అదేవిధంగా హేమలత రెడ్డి అందరితో కలిసిపోయి ఎంతో  సరదాగా దాండియా సంబరాల్లో పాల్గొని దాండియా ఆడారు.