India Vs Pakistan Test Match: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పాక్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్..!

Ind Vs Pak Test Series: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ ఎక్కడ జరిగినా.. ఏ ఫార్మాట్‌లో జరిగినా.. క్రీడా అభిమానులకు అది ఒక ఎమోషన్. ఇక క్రికెట్‌లో అయితే ఈ ఎమోషన్స్ తారాస్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్-పాక్ తలపడుతుండగా.. ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరగడం లేదు. అభిమానులు కూడా దాయాదుల మధ్య ముఖాముఖి సిరీస్‌ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గుడ్‌న్యూస్ తెరపైకి వచ్చింది.
 

1 /6

పాకిస్థాన్ జట్టు భారత్‌లో చివరిసారిగా 2012లో పర్యటించింది. ఆ తర్వాత రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు.   

2 /6

ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ గౌల్డ్‌ భారత్‌-పాకిస్థాన్‌ మధ్య టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని వెల్లడించారు.   

3 /6

ఇంగ్లాండ్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌ను నిర్వహించాలని ఆయన తన కోరికను వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌కు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నా.. బీసీసీఐ మాత్రం అంగీకరించకపోవచ్చు.  

4 /6

పాకిస్థాన్ వేదిక జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ భారత్ పాల్గొనడం లేదు. గతేడాది ఆసియా కప్ పాక్ వేదికగా జరిగినా.. భారత్ మాత్రం తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది.  

5 /6

వచ్చే పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్ ట్రోఫీపై బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పాక్‌లో కాకుండా శ్రీలంక లేదా దుబాయ్ వేదికగా తమ మ్యాచ్‌లు నిర్వహించాలని కోరుతోంది.  

6 /6

తాజాగా ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ గౌల్డ్‌ కామెంట్స్‌తో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. 17 ఏళ్ల క్రితం 2007లో భారత్, పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత టెస్టు సిరీస్‌ ఆడలేదు. ఇప్పటికైనా బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి మరి.