మోడీ ప్రమాణస్వీకారానికి జగన్ డుమ్మా ; కారణం ఇదే...

ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి ఏపీ నూతన సీఎం జగన్ వెళ్లడం లేదు

Last Updated : May 30, 2019, 03:49 PM IST
మోడీ ప్రమాణస్వీకారానికి జగన్ డుమ్మా ; కారణం ఇదే...

దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ముందుకు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏపీ సీఎం జగన్ తన ప్రమాణస్వీకారం అనంతరం.. తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ లతో కలిసి ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లాల్సి ఉంది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణస్వీకారం అనంతరం కార్యక్రమాలు ఆలస్యం కావడంతో జగన్ తన పర్యటనను రద్దుచేసుకున్నట్లు తెలిసింది.

ప్రముఖ మీడియా కథనం ప్రకారం మోదీ ప్రమాణస్వీకారానికి దేశ విదేశాల నుంచి అతిథులు వస్తుండంతో ఢిల్లీలో ఎయిర్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. దీంతో  ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకే ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని వీవీఐపీలకు అధికారులు సూచించారు. అయితే విజయవాడలోనే సమయం 3 గంటలు అయిపోవడంతో జగన్ తన పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నట్లు తెలిసింది.

Trending News