సత్తెనపల్లిలో ఉద్రిక్తత; స్పీకర్ కోడెలపై దాడి

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Last Updated : Apr 11, 2019, 01:42 PM IST
సత్తెనపల్లిలో ఉద్రిక్తత; స్పీకర్ కోడెలపై దాడి

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నియోజకవర్గ పరిధిలో ఉన్న యనమెట్ల గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన స్పీకర్ కొడెలపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంలో స్పీకర్ కోడెల చొక్కా చింపేశారు. ఈ దాడిలో కోడెల సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిసింది. 

పోలింగ్ తీరును ప్రశ్నించిందుకు వైసీపీ కార్యకర్తలు కోడెలపై దౌర్జన్యానికి పాల్పడడ్డారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.  పోలీసుల బందోబస్తు తక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నేతల ఆరోపిస్తున్నారు.
 

Trending News