వర్మ Vs క్రిష్: ఆర్జీవీ నోట మళ్లీ 'ఎన్టీఆర్ బయోపిక్‌' మాట ; మూవీ ముహర్తం ఫిక్స్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ 'లక్ష్మీష్ ఎన్టీఆర్ ' గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు               

Last Updated : Oct 12, 2018, 07:00 PM IST
వర్మ Vs క్రిష్: ఆర్జీవీ నోట మళ్లీ 'ఎన్టీఆర్ బయోపిక్‌' మాట ; మూవీ ముహర్తం ఫిక్స్

ఎన్టీఆర్ బయోపిక్‌  'లక్ష్మీస్ ఎన్టీఆర్ 'పై రామ్‌గోపాల్ వర్మ కొంత కాలం పాటు గమ్మున ఉండటంతో ఇక ఈ సినిమా ప్రాజెక్టు రద్దు చేసుకున్నాడనే టాక్ వినిపించింది. ఇదే సమయంలో క్రిష్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందిస్తున్న' ఎన్టీఆర్ బయోపిక్' ప్రాజెక్ట్ వేగవంతమౌతోంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో సర్‌ప్రైజ్ బయటకు వదులుతూ ప్రేక్షకుల్లో ఆతృతను పెంచేస్తున్నాడు. దీంతో వర్మ సినిమా గురించి చర్చ వదిలేసి అందరూ క్రిష్ మూవీపై దృష్టి పెట్టారు. సోషల్ మీడియా వేదికపై ఈ మూవీపై చర్చించుకోవడం మొదలెట్టారు.. ఇక కామ్ గా ఉంటే లాభం లేదని భావించిన రాంగోపాల్ వర్మ తాను తీయబోయే  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి సంబందించిన వివరాలు ప్రకటించి సంచలనానికి తెరలేపాడు. 

జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రూపొందించనున్నామన్న వర్మ ... ఈ విజయదశమికి సినిమా స్టార్ట్ చేసి జనవరి చివరికల్లా సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తామని ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 19న  వెల్లడిస్తామన్నారు. తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత ఈ మూవీకి సంబంధించిన ముహుర్తపు షాట్ ఉంటుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వర్మ  చేసిన ప్రకటనతో ఈ సినిమాపై మళ్లీ చర్చ మొదలైంది.  

 

 

 

ఏది ఏమైనప్పటికీ  క్రిష్ దర్శకత్వంలోని  ‘ఎన్టీఆర్’ బయోపిక్ , ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  బయోపిక్ ద్వారా ఎన్టీఆర్ జీవితంలోని అన్నికోణాలను చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతోంది. ఈ దిగ్గజ దర్శకులు ఎన్డీఆర్ జీవితంలో ఏయే సంఘటనలు చూపించనున్నారనే అంశంపై జనాల్లో  ఉత్కంఠ మొదలైంది.
 

Trending News