రూ.50 వేల మార్క్ దాటి బంగారం పరుగులు

బంగారం ధరలు రికార్ఢు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మరోసారి బంగారం ధరల రూ.50 వేల మార్క్ చేరుకుని పరుగులు తీస్తోంది. వెండి సైతం భారీగా ధరలు నమోదు చేస్తూ బంగారం బాటలోనే పయనిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 24, 2020, 06:49 AM IST
రూ.50 వేల మార్క్ దాటి బంగారం పరుగులు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు(Gold Rate Today) ఓ మోస్తరుగా పెరిగాయి. వెండి ధర సైతం బంగారం బాటలోనే పయనించింది.  హైదరాబాద్‌(Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.300 మేర స్వల్పంగా బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,580కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.200 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.46,290 వద్ద ట్రేడ్ అవుతోంది. తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ఢిల్లీలో నేటి మార్కెట్‌లో రూ.230 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,190 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.240 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,000 వద్ద మార్కెట్ అవుతోంది.  లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి

జూన్ తొలి వారంలో బులియన్ మార్కెట్‌లో గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధర(Silver Rate Today) ప్రస్తుతం మరోసారి రూ.49వేల మార్కుకు చేరువవుతోంది. నేడు వెండి ధర కేవలం రూ.130 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.48,800కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. 
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..     

Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

Trending News