భద్రతాదళాల చేతిలో ముగ్గురు తీవ్రవాదులు హతం

జమ్మూ-కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతాదళాలతో జరిగిన ఎన్కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు.

Last Updated : Mar 12, 2018, 05:37 PM IST
భద్రతాదళాల చేతిలో ముగ్గురు తీవ్రవాదులు హతం

శ్రీనగర్: సోమవారం జమ్మూ-కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతాదళాలు చేసిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. 'అనంతనాగ్ జిల్లాలోని హకురా ప్రాంతంలో తీవ్రవాదులు చొరబడ్డారని సమాచారం అందింది. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు' అని సైనికాధికారి ఒకరు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, భద్రతాదళాలకు ఎటువంటి హాని జరగలేదని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు, శనివారం సాయంత్రం దక్షిణ కాశ్మీర్లోని కుల్గం జిల్లాలో సీఆర్పీఎఫ్ గార్డు పోస్టుపై తీవ్రవాదులు ఒక గ్రెనేడ్‌ను విసిరేశారు. కాని ఎలాంటి నష్టం జరగలేదు. "ఉగ్రవాదులు కుల్గంలోని డమాల్ హంజిపోరా వద్ద ఉన్న సిఆర్పిఎఫ్ 18వ బెటాలియన్ గార్డు పోస్టుపై గ్రెనేడ్‌ను విసరివేశారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు" అని కాశ్మీర్ జోన్ పోలీస్ తమ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Trending News