ఐదో దశ పోలింగ్ : బరిలో ఉన్న ప్రముఖులు వీరే...

 ఐదో దశ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు

Last Updated : May 6, 2019, 09:29 AM IST
ఐదో దశ పోలింగ్ : బరిలో ఉన్న ప్రముఖులు వీరే...

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ  రోజు ఐదో విడత పోలింగ్ జరుగుతోంది. ఐదో దశలో యూపీ, రాజస్థాన్ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో  51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 674 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దశలో ఏఐసీసీ రాహుల్ గాంధీ, సోనియా, రాజ్‌నాథ్  సింగ్  ఎన్నికల బరిలో ఉన్నారు

ఐదో దశ ఎన్నికల బరిలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, జయంత్‌సిన్హా, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, జార్ఖండ్‌ మాజీ సీఎం అర్జున్‌ ముండా, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ,  రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, కృష్ణపునియా  వంటి హేమాహేమీలు ఎన్నికల బరిలో నిలిచారు.దీంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

Trending News