Rs. 1000 Cr Compensation: కరోనా వ్యాక్సిన్ వల్లే కూతురు చనిపోయిందంటూ.. హైకోర్టులో పిటిషన్! రూ.1000 కోట్లు డిమాండ్

కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకోవడం వలనే తన కూతురు చనిపోయిందంటూ ఆరోపిస్తూ మహారాష్ట్ర ఔరంగాబాద్​కు చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 10:30 AM IST
  • వ్యాక్సిన్ వల్లే కూతురు చనిపోయిందంటూ.. హైకోర్టు పిటిషన్
  • ఎన్ని కోట్లు డిమాండ్ చేశాడంటే?
  • హైకోర్టు విచారణకు ఇంకా రాలేదు
Rs. 1000 Cr Compensation: కరోనా వ్యాక్సిన్ వల్లే కూతురు చనిపోయిందంటూ.. హైకోర్టులో పిటిషన్! రూ.1000 కోట్లు డిమాండ్

Man approches Bombay HC for 1000 cr compensation: కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకోవడం వలనే తన కూతురు చనిపోయిందంటూ ఆరోపిస్తూ మహారాష్ట్ర ఔరంగాబాద్​కు చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైద్య విద్యార్థిని అయిన తన కూతురు గతేడాది వ్యాక్సిన్ తీసుకుని.. సైడ్ ఎఫెక్ట్స్​ కారణంగా ప్రాణాలు కోల్పోయిదని పిటిషన్ పేర్కొన్నాడు. అంతేకాదు అతడు భారీ పరిహారాన్ని కోరాడు. మహారాష్ట్ర ప్రభుత్వం, సదరు వ్యాక్సిన్ సంస్థ రూ.1000 కోట్లు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని సదరు వ్యక్తి ఆ పిటిషన్​లో కోరాడు.  

'నా కుమార్తె పేరు స్నేహాల్. నాసిక్​లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో భాగంగా ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాంతో నా కూతురు గతేడాది జనవరిలో కొవిషీల్డ్ టీకా వేసుకుంది. కరోనా టీకా సురక్షితమని, ఎలాంటి హానీ ఉండదని చెప్పారు. అది నమ్మి వైద్య కళాశాలలో నా కూతురు వ్యాక్సిన్​ తీసుకుంది' అని లునావత్ పిటిషన్ పేర్కొన్నారు.

టీకా తీసుకున్న నా కూతురు ఆరోగ్య కార్యకర్తగా కూడా సేవలందించింది. టీకా సురక్షితమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ), ఎయిమ్స్ డైరెక్టర్‌​, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తప్పుడు ప్రచారం చేయడం వల్లే నా కూతురు లాంటి ఎందరో కార్యకర్తలు వ్యాక్సిన్​ తీసుకున్నారు' అని లునావత్ పిటిషన్లో తెలిపారు.

తన కూతురు 2021 జనవరి 28న టీకా తీసుకుందని, ఆ తర్వాత దుష్ప్రభావాల కారణంగా మార్చి 1న మరణించిందని లునావత్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. కొవిషీల్డ్ టీకా దుష్ప్రభావాల కారణంగానే నా కుమార్తె మృతి చెందిందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఈఎఫ్‌ఐ కమిటీ గతేడాది అక్టోబర్​ 2న వెల్లడించినట్లు తెలిపారు. తన కుమార్తెకు సరైన న్యాయం కావాలని, రూ.1000 కోట్లు పరిహారం చెల్లించాలని సదరు వ్యక్తి బాంబే హైకోర్టు పిటిషన్‌లో వివరించారు. ఈ కేసును గతవారమే దాఖలు చేయగా.. హైకోర్టు విచారణకు ఇంకా రాలేదు. 

Also Read: Burning Lorry Kerala: అగ్నిప్రమాదానికి గురైన గడ్డివాము లారీ.. ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు!

Also Read: Varun Tej Lavanya Tripathi Marriage: వరుణ్‌తో పెళ్లి.. లావణ్య త్రిపాఠి ఏమన్నారంటే?!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News