Shivraj Singh Chouhan:కరోనా నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్ సీఎం

 రెండు వారాలకు పైగా చికిత్స తీసుకున్న అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) కరోనా బారి నుంచి కోలుకున్నారు. 

Last Updated : Aug 11, 2020, 03:58 PM IST
Shivraj Singh Chouhan:కరోనా నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్ సీఎం

Covid-19: న్యూఢిల్లీ:  సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రెండు వారాలకు పైగా చికిత్స తీసుకున్న అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన కోవిడ్19 టెస్టులలో తనకు నెగటివ్ (Shivraj Chouhan Covid19 Negative)‌గా తేలిందని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆస్తిలో కుమార్తెలకు హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

జులై 25న సీఎం శివరాజ్ సింగ్‌కు కరోనా నిర్థారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన భోపాల్‌లోని చిరయు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. 11 రోజుల తర్వాత గత బుధవారం వైద్యుల సలహా మేరకు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఇంట్లో హోం ఐసోలేషన్‌లో ఉండి పరిపాలనా బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తనకు తాజాగా జరిపిన టెస్టుల్లో కోవిడ్19 నెగటివ్‌గా వైద్యులు నిర్ధారించారని శివరాజ్ చౌహాన్ తెలిపారు. Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్   
Photos:  అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..

తనకు వైద్యసేవలు అందించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. డాక్టర్ల సలహామేరకు రేపటి వరకు ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు వెల్లడించారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్‌లో ఆయన రాసుకొచ్చారు. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు  
రానా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, పూజలు

Trending News