ఎన్నికల్లో పోటీ పై క్లారిటీ ఇచ్చిన మాధురీ దీక్షిత్

                        

Last Updated : Mar 28, 2019, 07:16 PM IST
ఎన్నికల్లో పోటీ పై క్లారిటీ ఇచ్చిన మాధురీ దీక్షిత్

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ  వార్తలపై స్పందించిన మాధురీ.... తాను ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు. తాను లోక్ సభ స్థానానికి పోటీచేస్తానంటూ వస్తున్న వార్తలు.. ఊహాగానాలేనని కొట్టి పారేశారు. తాను ఏ పార్టీ తరపున పోటీ చేయబోనని... ఇప్పటికే దీనికి సంబంధించి క్లారిటీని కూడా ఇచ్చానని మాధురి వివరణ ఇచ్చారు. 

1984లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన మాధురీ దీక్షిత్... స్వల్ప కాలంలోనే అగ్రస్థాయికి చేరుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. స్థార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమెకు పలు పార్టీల ఆహ్వానాలు వస్తున్నాయి. అయితే వాటిని ఆమె సున్నితంగా తిరస్తున్నారట.

Trending News