Coronavirus alert: మోగుతున్న ప్రమాద ఘంటికలు, కరోనా కొత్త కేసుల్లో ఇండియాదే అగ్రస్థానం

Coronavirus alert: ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో అతి ప్రమాదకరంగా మారింది. కొత్త కేసుల నమోదులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచి ఆందోళన కల్గిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2021, 02:43 PM IST
  • ఇండియాలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్
  • రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా, బ్రెజిల్ దేశాల్ని దాటేసిన ఇండియా
  • ఇండియాలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 89 వేల 129 కొత్త కేసులు నమోదు
Coronavirus alert: మోగుతున్న ప్రమాద ఘంటికలు, కరోనా కొత్త కేసుల్లో ఇండియాదే అగ్రస్థానం

Coronavirus alert: ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో అతి ప్రమాదకరంగా మారింది. కొత్త కేసుల నమోదులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచి ఆందోళన కల్గిస్తోంది. 

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) గడగడలాడిస్తోంది. ఊహించని వేగంతో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. దేశంలో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆరేడు నెలల క్రితం రోజుకు ఎన్ని కేసులు నమోదయ్యేవో..అదే సంఖ్యలో నమోదవుతున్నాయి. ఓ వైపు కోవిడ్ వ్యాక్సినేషన్(Covid Vaccination) ప్రక్రియ కొనసాగుతున్నా...కరోనా వైరస్ మాత్రం వేగంగా వ్యాపిస్తోంది. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. రోజువారీ కొత్త కేసుల్లో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే ముందుంది. అమెరికా, బ్రెజిల్ దేశాల్ని దాటేసింది. 

ఇండియాలో గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య..89 వేల 129
అమెరికాలో గత 24 గంటల్లో కొత్త కేసులు...69 వేల 986
బ్రెజిల్ దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య 69 వేల 662

సెప్టెంబర్ నెల తరువాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే. ఇండియాలో ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 23 లక్షల 92 వేల 260కు చేరుకుంది. ఇందులో ఇప్పటివరకూ 1 కోటి 15 లక్షల 69 వేల 241 మంది కోలుకోగా 1 లక్షా 64 వేల 110 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 6 లక్షల 58 వేల 509 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రికవరీ రేటు 93.36 శాతం కాగా..మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటివరకూ 7 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ (Corona vaccination) ఇచ్చారు.  వీరిలో తొలిడోసు తీసుకున్న వారు 6 కోట్ల 13 లక్షల 56 వేల 345 కాగా, రెండు డోసులు పూర్తయినవారు 92 లక్షల 61 వేల 681 మంది ఉన్నారు. 

Also read: Tamilnadu politics: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దుమారం, ఈసీకు బీజేపీ ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News