బినామీల వివరాలు చెబితే రూ. కోటి రివార్డు : ఆదాయపు పన్ను శాఖ

                                               

Last Updated : Jun 2, 2018, 12:58 PM IST
బినామీల వివరాలు చెబితే రూ. కోటి రివార్డు : ఆదాయపు పన్ను శాఖ

బినామీ పేరు మీద బ్లాక్ మనీ దాచుకున్న నల్లకుభేరుల భరతం పట్టేందుకు ఆదాయపు పన్నుశాఖ  సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. బినామీదారులకు సంబంధించిన వివరాలు చెబితే రూ.కోటి ఇస్తామని ప్రకటించింది. దీనికి ‘బినామీ లావాదేవీల సమాచార రివార్డు పథకం 2018’ అని పేరు పెట్టింది. అలాగే సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.  సమాచారమిచ్చిన వారికి భద్రత కల్పిస్తామని ..దీని కోసం వారు ఇన్‌కంటాక్స్ కార్యాలయానికి వచ్చి ఓ ఫాం నింపితే సరిపొతుందని అధికారులు పేర్కొన్నారు

Trending News