హిమాచల్‌ పోలింగ్ సూపర్ సక్సెస్..!

  

Last Updated : Nov 9, 2017, 07:42 PM IST
హిమాచల్‌ పోలింగ్ సూపర్ సక్సెస్..!

ఎట్టకేలకు హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ హాయిగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటలకు వరకు సాగడం గమనార్హం. 68 నియోజకవర్గాలలో దాదాపు 337 అభ్యర్థులు పోటీలో నిలవగా, 74 శాతం  ఓటింగ్ జరిగినట్లు అధికారిక అంచనా. ఎప్పటిలాగే ఈ సారి కూడా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఎక్కువగా 68 శాతం ఓటింగ్ నమోదైంది. తొలిసారిగా ఓటు రసీదు యంత్రాలను అనగా వీవీ ప్యాట్‌లను ఈ ఎన్నికలలో వినియోగించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తదితరులు ఈ సారి హిమాచల్ ప్రదేశ్‌లోని తమ నియోజకవర్గాలకు వచ్చి ఓటు వేశారు. దాదాపు 40 వేల మంది పోలీసు యంత్రాంగం ఈ ఎన్నికలకు రక్షణ, భద్రతా బాధ్యతలను చేపట్టారు. డిసెంబరు 18, 2017న ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. 100 ఏళ్లు దాటి కూడా ఓటు వేయడానికి వచ్చిన సీనియర్ సిటిజన్ శ్యామ్ శరణ్ నేగి ఈ ఎన్నికలలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కల్పి నియోజక వర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 120 సంవత్సరాలు దాటిని మరో సూపర్ సీనియర్ సిటిజన్ చూరీదేవి మండీ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 

 

Trending News