ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా అన్షులా కాంత్

ఎస్బీఐకి కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌

Last Updated : Sep 7, 2018, 06:15 PM IST
ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా అన్షులా కాంత్

భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అన్షులా కాంత్‌ని ప్రభుత్వం నియమించినట్టుగా బ్యాంక్ అధికారవర్గాలు ప్రకటించాయి. శుక్రవారమే ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా అన్షులా కాంత్ నియామకంపై ఉత్తర్వులు జారీ అయినట్టుగా ఎస్బీఐ అధికారవర్గాలు ఈ ప్రకటనలో పేర్కొన్నాయి. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన అన్షులా కాంత్ ఇప్పటివరకు ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా అన్షులా కాంత్ నియామకంతో ప్రస్తుతం సంస్థలో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్స్ సంఖ్య 4కు చేరింది. పీకే గుప్తా, డీకే ఖారా, అరిజిత్ బసు ఇప్పటికే భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్స్‌గా కొనసాగుతున్నారు.

Trending News