తొలిదశ సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం

దేశ వ్యాప్తంగా రేపు జరిగే  తొలి విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది

Last Updated : Apr 10, 2019, 10:16 AM IST
తొలిదశ సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం

దేశ వ్యాప్తంగా జరిగే తొలిదశ సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ సామాగ్రిని  పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల సిబ్బంది కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

తొలి దశ పోలింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు..ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు.

తొలి దశలో భాగంగా రేపు దేశ వ్యాప్తంగా 91 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 25 స్థానాల్లో లోక్ సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.  ఇదిలా ఉండగా మే 23 న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి

Trending News