Droupadi Murmu Becomes President: భారత దేశ చరిత్రలో ద్రౌపది ముర్ము ఓ సరికొత్త అధ్యాయం లిఖించారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము.. దేశంలోనే రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇన్నేళ్ల స్వరాజ్యంలో గిరిజన తెగకు చెందిన వారు రాష్ట్రపతిగా ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం విశేషం.