పీడీపీ, కాంగ్రెస్ కలయిక ఉగ్రవాదులకు మాత్రమే మేలు చేస్తుంది - సుబ్రమణ్యస్వామి

                               

Last Updated : Jul 3, 2018, 08:53 PM IST
పీడీపీ, కాంగ్రెస్ కలయిక ఉగ్రవాదులకు మాత్రమే మేలు చేస్తుంది - సుబ్రమణ్యస్వామి

కాంగ్రెస్, పీడీపీలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, పీడీపీ పార్టీలు ఉగ్రవాదులకు అనుకూల పార్టీలని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఏకమైతే కాశ్మీర్ లో ఉగ్రవాదులకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని..అచారక పాలన సాగుతుందని విమర్శించారు.  పీడీపీ, కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకుంటాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది  కశ్మీర్ కు చేటును కలిగిస్తుందన్నారు. 

ఇటీవలే పీడీపీ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీపీడీకి మోజార్టీ సీట్లు లేని కారణంగా అక్కడ పభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని పీడీపీ యోచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్  కూడా పీడీపీతో పొత్తుకు సై అనేలా కనిపిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి తాజా వ్యాఖ్యలు చేశారు.

Trending News