పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం : నాకే పాపం తెలీదన్న మెహుల్ చోక్సీ

నాకే పాపం తెలీదన్న నిరవ్ మోడీ సమీప బంధువు మెహుల్ చోక్సీ 

Last Updated : Sep 11, 2018, 03:29 PM IST
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం : నాకే పాపం తెలీదన్న మెహుల్ చోక్సీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితులలో ఒకరైన బడా వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఈ విషయంలో ఏ పాపం తెలీదట. తనకు సంబంధం లేని విషయంలో తనని ఇరికించారని, అన్యాయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఆస్తులు అటాచ్ చేసిందని చెబుతూ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తానే స్వయంగా వీడియో ద్వారా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. పైగా తనపై చేస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని మెహుల్ చోక్సీ చెబుతున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.13,000 కోట్లు మోసం చేసి విదేశాలకు పారిపోయిన నిరవ్ మోడీకి సమీప బంధువైన మెహుల్ చోక్సీ కూడా ఆ కుంభకుణం తర్వాత దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చోక్సీ ఆంటిగ్వాలో ఉండగా అతడి న్యాయవాది అడిగిన ప్రశ్నలకు సమాధానం అతడు ఈ వీడియో పంపించినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది.

 

Trending News