లోయలో పడిన స్కూల్ బస్సు, డ్రైవర్ సహా ఏడుగురు మృతి!

లోయలో పడిన స్కూల్ బస్సు, డ్రైవర్ సహా ఏడుగురు మృతి!

Last Updated : Jan 9, 2019, 04:16 PM IST
లోయలో పడిన స్కూల్ బస్సు, డ్రైవర్ సహా ఏడుగురు మృతి!

సిర్మౌర్: హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాదాహు-సంగ్ర రహదారిపై ప్రయాణిస్తున్న ఓ స్కూల్ బస్సు ఉన్నట్టుండి అదుపుతప్పి రోడ్డు పక్కనే వున్న భారీ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు, బస్సు డ్రైవర్ సహా మొత్తం ఏడుగురు మృతి చెందినట్టు సిర్మౌర్ జిల్లా ఎస్పీ రోహిత్ మల్పానీ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 19 మంది ఉన్నారని, మృతి చెందిన విద్యార్థులు అక్కడి స్థానిక డీఏవీ పాఠశాలకు చెందిన వారిగా సమాచారం అందుతోంది. దుర్ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 

తీవ్రంగా గాయపడిన విద్యార్థులను దాదాహు ఆస్పత్రికి తరలించగా మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నహన్‌కి తరలించారు. తీవ్రగాయాలపాలైన ఐదుగురు విద్యార్థులు, బస్సు డ్రైవర్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన మరో 12 మందిలో ఇంకొంత మంది పరిస్థితి విషమంగానే వున్నట్టు సమాచారం. 

 

 

Trending News