మహేష్ బాబు ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన దిల్ రాజు!

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన దిల్ రాజు! 

Last Updated : Mar 7, 2019, 09:47 AM IST
మహేష్ బాబు ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన దిల్ రాజు!

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అభిమానులకు దిల్ రాజు మళ్లీ షాకిచ్చాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మహర్షి సినిమాను మళ్లీ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వారిని మళ్లీ సస్పెన్స్‌కి గురయ్యేలా చేశాడు. మొదట అనుకున్న ప్రణాళిక ప్రకారం ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సి వున్న ఈ సినిమా అనుకోని కారణాల వల్ల ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్ 25వ తేదీకైనా మహర్షి సినిమాను చూడొచ్చులే అని ఆశించిన సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఆ ఆనందం కూడా ఎక్కువరోజులు లేకుండా సినిమా మళ్లీ వాయిదా పడినట్లు చిత్ర నిర్మాత దిల్‌రాజు తమ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా ప్రకటించారు.

 

అవును, మహర్షి సినిమాను మే 9న విడుదల చేయనున్నట్లు దిల్ రాజు తెలిపారు. మార్చి 17కి టాకీ పార్ట్‌ పూర్తవుతుందని అది కాకుండా మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి వుందని దిల్ రాజు వెల్లడించారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేశ్‌ ఓ కీలక పాత్రను పోషిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

 

Trending News