బిగ్ బాస్ ఫైనల్‌కు చీఫ్ గెస్ట్‌లుగా ఆ ఇద్దరు స్టార్ హీరోలు..!

బిగ్ బాస్ ఫైనల్‌కు చీఫ్ గెస్ట్‌లుగా ఆ ఇద్దరు స్టార్ హీరోలు..!

Last Updated : Sep 30, 2018, 10:15 AM IST
బిగ్ బాస్ ఫైనల్‌కు చీఫ్ గెస్ట్‌లుగా ఆ ఇద్దరు స్టార్ హీరోలు..!

బిగ్ బాస్ సీజన్ 2 (తెలుగు) చివరి దశకు చేరుకుంది. ఈ ఆదివారం ఫైనల్ జరగనుంది. 110 రోజుల పాటు పార్టిసిపెంట్స్ పాల్గొనగా.. చివరికు ఐదుగురు ఫైనల్‌కి చేరుకున్నారు. ఈ ఐదుగురిలో టైటిల్ విన్నర్ ఒక్కరే కానున్నారు.

ఇది ఇలా ఉంటే ఫైనల్‌కు చీఫ్ గెస్ట్ ఎవరనేది ఆసక్తిగా మారింది. సీజన్ 1 వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీఆర్ వస్తాడని వార్తలు రాగా.. ‘అరవింద సమేత’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి అతను రావడం లేదని తెలిసింది. ఇంకొంతమంది స్టార్స్ పేర్లు కూడా వినిపించగా.. చివరికి విక్టరీ వెంకటేష్ వస్తున్నట్లు తెలిసింది. ‘మా’ బృందం ఆయనను సంప్రదించగా ఓకే చెప్పారని..  వెంకటేష్ చేతులు మీదుగా టైటిల్ ట్రోఫీని అందించనున్నారని సమాచారం.

ఇక ఇప్పటికే తెలుగు బిగ్ బాస్‌లో సంద‌డి చేసిన టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ.. బిగ్ బాస్ త‌మిళ వెర్ష‌న్ ఫైన‌ల్‌కి గెస్ట్‌‌గా వెళ్లాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ద్విభాష చిత్రం ‘నోటా’ ప్రమోషన్స్ లో భాగంగా వెళ్లాడని సమాచారం. ముందుగా లోకనాయకుడు కమల్ హాసన్‌ని కలిసి ఫోటో దిగి ఆ తర్వాత ఇంట్లోకి టైటిల్‌తో ప్రవేశించి వారితో సరదాగా కబుర్లు చెప్పాడు విజయ్. తమిళ బిగ్ బాస్‌లో సినిమాని ప్రమోట్ చేసుకొనే అవకాశం తొలిసారి విజయ్ దేవరకొండకే దక్కడంతో ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతేకాదు బిగ్ బాస్ విజేత ఎవరనేది ప్రకటించే అవకాశం కూడా విజయ్‌కే ఇవ్వడంతో ఆయన ఆనందానికి హద్దులేవు. ‘నోటా’ సినిమా వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Trending News