వైకుంఠపురంలో... ఫిక్స్ అయిందా ?

వైకుంఠపురంలో... ఫిక్స్ అయిందా ?

Last Updated : Aug 13, 2019, 03:15 PM IST
వైకుంఠపురంలో... ఫిక్స్ అయిందా ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అందులో జులాయి ఘన విజయం సాధించగా s/o సత్యమూర్తి సినిమా కలెక్షన్స్ పరంగా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా.. ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఇదిలావుండగా, ప్రస్తుతం ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోంది. అభిమానులకు 2020 సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఇంతవరకు అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

అయితే, ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా టైటిల్‌పై చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. 'అలకనంద', 'నేను.. నాన్న' వంటి కొన్ని పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉండగా తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. టాలీవుడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు 'వైకుంఠపురంలో..' అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. బన్నీ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్ర పోషిస్తోంది. డీజే తర్వాత బన్నీ, పూజా హెగ్డె కాంబోలో వస్తోన్న రెండో సినిమా ఇది.

Trending News