సరోగసి ద్వారా కవలలకు తల్లి అయిన బాలీవుడ్ నటి ప్రీతీ జింటా

Preity Zinta: తాము తల్లిదండ్రులైనట్లు ప్రీతీ జింటా, జెనీ దంపతులు ప్రకటించారు. సరోగసి విధానం ద్వారా కవలలను పొందినట్లు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 02:09 PM IST
సరోగసి ద్వారా కవలలకు తల్లి అయిన బాలీవుడ్ నటి ప్రీతీ జింటా

Actress Preity Zinta, husband Gene Goodenough have turned parents: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతీ జింటా గుడ్​ న్యూస్ చెప్పారు. సరోగసి ద్వారా కవలలను పొందినట్లు అమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కవలల్లో ఒక బాబు, ఒక పాప ఉన్నట్లు తెలిపారు ప్రీతీ. బాబు పేరును జయ్​గా, పాప పేరును జియాగా పెట్టినట్లు (Preity Zinta Kids Names) వెల్లడించారు.

'నేను మీ అందరితో ఓ అద్భుతమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్న. జెనీ (ప్రీతీ జింటా భర్త పేరు), నేను చాలా సంతోషంగా ఉన్నాం. జై జింటా గుడెనఫ్​, జియా జింటా గుడెనఫ్​ (పిల్లల పేర్లు)లను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్న సందర్భంగా మా హృదయాలు ప్రేమతో నిండిపోయాయి. కొత్త జీవితం ప్రారంభించనున్నందున మాకు చాలా సంతోషంగా ఉంది. సరోగసి విధానం సక్రమంగా జరిగేందుకు కృషి చేసిన డాక్టర్లు, అందుకు సహకరించిన నర్సులు, ఇందులో భాగమైన అందరికి ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు ప్రీతీ జింటా.

Also read: ‘స్త్రీ ఎవ్వడికి దాసి కాదు’.. అదిరిపోయే డైలాగ్ తో ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్ వచ్చేసింది

Also read: అమెరికా బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణ కొత్త చిత్రం.. వార్తల్లో నిజమెంత?

ప్రీతీ జింటా గురించి..

ప్రీతీ జింటా 1975 జనవరి 31న హిమాచల్ ప్రదేశ్​లోని షిమ్లాలో జన్మించిచారు. 1998లో షారుక్ ఖాన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన దిల్​ సే సినిమా (Preity Zinta First Movie) ద్వారా సిని ప్రవేశం చేశారు. బాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించారు ప్రీతీ జింటా. 1998లోనే విక్టరీ వెంటటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా సినిమాతో తెలుగు (Preity Zinta in Telugu Cinema) తెరపై మెరిశారు ఈ సొట్ట బుగ్గల సుందరి.

Also read: శ్యామ్‌ సింగరాయ్‌ పక్కా హిట్ అట, ఈ క్రిస్మస్‌ మనదే అంటోన్న నాని

1999లో రాఘవేంద్ర రావు​ దర్శకుడిగా.. మహేశ్​బాబును హీరోగా పరిచయం చేసిన రాజకుమారుడు సినిమాలోను ప్రీతీ జింటా హీరోయిన్​గా నటించారు.

2016 ఫిబ్రవరిలో ఆమె అమెరికా చెందిన గుడెనఫ్​ను వివాహం చేసుకుంది. జెనీ గుడెనఫ్​ అమెరికా కేంద్రంగా పని చేస్తున్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్​ కంపెనీ ఎన్​లైన్​ ఎనర్జీ సీనియర్​ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

నటిగానే కాకుండా.. ప్రముఖ వ్యాపార వేత్తంగా కూడా ప్రీతీ జింటా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఐపీఎల్​లో పంజాబ్​ కింగ్స్ ఫ్రైంఛైజీ ఓనర్లలో ప్రీతీ జింటా కూడా ఒకరు. ఈ ఫ్రాంఛేంజీలో అమెకు 23 శాతం వాటా (Preity Zinta Share in Punjab Kings) ఉంది.

Also read: బీచ్‌లో సెక్సీ లుక్స్‌తో హల్‌చల్ చేస్తున్న బుట్టబొమ్మ..పూజా హెగ్డే

Also read: సంచలన నిజాలు వెల్లడించిన నటి షాలు చౌరాసియా.. పొదల్లోకి తోసి లైంగిక దాడికి పాల్పడ్డంటూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News