The Raja Saab: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి భారీ ప్రాజెక్ట్‌లు క్యూ.. మిస్టర్ బచ్చన్, ది రాజా సాబ్‌పై ఓ రేంజ్‌లో అంచనాలు

People Media Factory Movies: పీపుల్స్ మీడియ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నుంచి భారీ ప్రాజెక్ట్‌లు రానున్నాయి. వచ్చే నెల మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ గ్లింప్స్‌తో ప్రమోషన్ మొదలైంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 30, 2024, 05:20 PM IST
The Raja Saab: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి భారీ ప్రాజెక్ట్‌లు క్యూ.. మిస్టర్ బచ్చన్, ది రాజా సాబ్‌పై ఓ రేంజ్‌లో అంచనాలు

People Media Factory Movies: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస ప్రాజెక్ట్‌లతో జోరు మీద ఉంది. హై-బడ్జెట్ సినిమాలు, కంటెంట్-బేస్డ్ మూవీస్‌కు అడ్డాగా మారింది. ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ తన టేస్ట్‌కు తగినట్లు అన్ని జానర్లలో సినిమా తెరకెక్కిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన మిస్టర్ బచ్చన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 15న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. రీసెంట్‌గా రిలీజ్ అయితే ఈ మూవీ టీజర్ నెట్టింట ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. రవితేజ-హరీష్ శంకర్ కాంబో మరోసారి రిపీట్ కానుండడంతో అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Income Tax Free: సంపాదించిన డబ్బంతా మీకే! ఆదాయ పన్ను లేని దేశాలు ఏవో తెలుసా?
 
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రానున్న మరో భారీ ప్రాజెక్ట్ ది రాజా సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గ్లింప్స్ రీసెంట్‌గా రిలీజ్ చేయగా.. ఓ రేంజ్‌లో ఆడియన్స్‌ నుంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్‌తోనే ఆడియన్స్‌లో ఎక్స్‌పెటేషన్స్ భారీగా పెరిగిపోయాయి. గ్లింప్స్‌లో ప్రభాస్ మళ్లీ డార్లింగ్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గ్లింప్స్‌లో ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు రెబల్ స్టార్. రెడ్ కోట్ వేసుకొని.. కూలింగ్ గ్లాసులు పెట్టుకొని స్టైలిష్‌గా బైక్‌పై నుంచి దిగాడు. అక్కడ ఉన్న పూలతో తనకు తానే దిష్టి తీసుకున్నాడు. గ్లింప్స్ చూసి అభిమానులు దిష్టి పెడతారని ముందే తనకు తానే దిష్టి తీసుకున్నట్లు ఉంది.

నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ లైనప్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మిస్టర్ బచ్చన్, ది రాజా సాబ్ సినిమాలతో పాటు తేజ సజ్జతో మిరాయ్, అడివి శేష్‌తో G2 వంటి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఆకర్షణీయమైన కథనాలను రూపొందించడంలో.. డిఫరెంట్ కథాకథనాలను అన్వేషించడంలో తమ నిర్మాణ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఆయన చెబుతున్నారు. ఈ సినిమాలే కాకుండా సన్నీ డియోల్, గోపీచంద్ మలినేనిల డైనమిక్ కాంబినేషన్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలు, స్టార్ క్యాస్టింగ్‌తో అదిరిపోయే కంటెంట్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎప్పుడు ముందుంటుదని టీజీ విశ్వప్రసాద్ చెబుతున్నారు. 

Also Read: Snake: నాగ పంచమికి ముందు అరుదైన ఘటన.. నాగ దేవత విగ్రహం మీద పడగ విప్పిన నాగు పాము.. వీడియోవైరల్..  

Also Read: Mahindra Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా థార్ రాక్స్‌ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News