Allari Naresh: 'ఆంటీ అయితే.. ఎవరైతే ఏంటి కావాల్సింది పెళ్లి: 'ఆ ఒక్కటీ అడక్కు' టీజర్‌

Aa Okkati Adakku Movie Teaser Out: పెళ్లి నేపథ్యంలో వస్తున్న 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా టీజర్‌ నవ్వులు పూయిస్తోంది. ఈ సినిమాతో మళ్లీ తన ట్రాక్‌ మీదకు అల్లరి నరేశ్‌ వచ్చినట్టు కనిపిస్తోంది. టీజర్‌ మీరు చూసి నవ్వుకోండి.. వేసవి వినోదానికి సిద్ధమవ్వండి

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 12, 2024, 07:12 PM IST
Allari Naresh: 'ఆంటీ అయితే.. ఎవరైతే ఏంటి కావాల్సింది పెళ్లి: 'ఆ ఒక్కటీ అడక్కు' టీజర్‌

Aa Okkati Adakku: నాంది, మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం నుంచి నా సామిరంగ వరకు సీరియస్‌ నేపథ్యంలో సినిమాలు చేసిన అల్లరి నరేశ్‌ చాలా రోజుల తర్వాత హాస్య ప్రధాన ఇతివృత్తంగా 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా చేస్తున్నాడు. టైటిల్‌తోనే నవ్విస్తున్న ఈ సినిమా ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌తో మరింత ఆసక్తిని పెంచింది. ఇక తాజాగా విడుదలైన టీజర్‌లో సినిమాపై అంచనాలు పెంచేసింది. కొత్త తరహా కథా నేపథ్యంతో నరేశ్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని టీజర్‌ చూస్తే తెలుస్తోంది. 

Also Read: Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ సంచలనం.. తల్లి పేరు చేర్చుకుని 'సాయి దుర్గ తేజ్‌' పునః నామకరణం

పెళ్లి కోసం ఎదురుచూస్తున్న 'గణ' పాత్రలో నరేశ్‌ కనిపిస్తున్నాడు. '25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలి. లేకపోతే ఆ జన్మాంతం బ్రహ్మాచారిగానే మిగిలిపోతాడు' అంటూ జ్యోతిష్యుడి డైలాగ్‌ టీజర్‌ మొదలవగా.. 'పెళ్లెప్పుడూ' అని ఇతర పాత్రధారులతో ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు నవ్వులు తెప్పించాయి. అనంతరం ఒక మ్యారేజ్‌ బ్యూరోకు వెళ్లడం, అనంతరం హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా పరిచయం కావడం వంటివి టీజర్‌లో ఉన్నాయి.

Also Read: Sharwanand Baby Girl: బర్త్‌ డే నాడే హీరో శర్వానంద్‌కు డబుల్‌ ప్రమోషన్‌.. 'అద్భుతం' పక్కన చేరింది

'మీరు నచ్చారు. మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకుందాం' అంటే హీరోయిన్‌ 'ఆ ఒక్కటీ అడక్కు' అని బదులివ్వడం టీజర్‌లో హైలెట్‌. అనంతరం రజిత ఆంటీని కలవడానికి వెళ్తున్నానని హీరో చెప్పగా.. 'ఆంటీయా అమ్మాయిలను వదిలేసి ఆంటీల వెనుకపడ్డారా? ఛీ ఛీ' అని వెన్నెల కిశోర్‌ ప్రశ్నించగా.. పక్కనే ఉన్న ఓ పాత్ర 'ఎవరైతే ఏంటి అన్నయ్య పెళ్లయితే అదే పది వేలు' అని చెబుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన డైలాగ్‌లతో టీజర్‌ కొనసాగుతుంది. రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జామి లివర్‌, వైవా హర్ష, అరియానా గ్లోరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మించిన ఈ చితరానికి మల్లీ అంకం దర్శకత్వం వహించాడు. గోపీ సుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. నరేశ్‌, ఫరియా జోడి చక్కగా కుదిరింది. పెళ్లి అవడం లేదనే నేటితరం యువత కథను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పెళ్లి కాని బ్రహ్మచారులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఈ కథాంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. గతంలో ఈ సినిమాను మార్చి నెలాఖరున విడుదల చేస్తామని ప్రకటించగా.. ఇప్పుడు విడుదల అనేది ఎప్పుడో చెప్పలేదు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. 

టీజర్ చూడండి ఇక్కడ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News