Bigg Boss Shivaji: నన్ను పక్కనపెట్టి.. పల్లవి ప్రశాంత్ ని విన్నార్ గా..: బిగ్ బాస్ ఓటమిపై శివాజీ

Bigg Boss Season 7: మరోసారి నాగార్జున హోస్టుగా చేస్తూ మన ముందుకు వచ్చిన బుల్లితెర సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్. పర్వాలేదు అనిపించుకున్న ఈ సీజన్ గత ఆదివారంతో ఫినాలే ముగించుకుంది. ఇక బిగ్ బాస్ లో మొదటిసారి ఒక కామనర్ ట్రోఫీ గెలుచుకున్నారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2023, 08:35 AM IST
Bigg Boss Shivaji: నన్ను పక్కనపెట్టి.. పల్లవి ప్రశాంత్ ని విన్నార్ గా..: బిగ్ బాస్ ఓటమిపై శివాజీ

Shivaji Video: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్లను ను ప్రకటించిన దగ్గర నుంచి.. అందరూ శివాజీ తప్పకుండా ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారు అని అనుకుంటూ వచ్చారు. అందుకు ముఖ్య కారణం ఈసారి ప్రకటించిన హౌస్ మేట్స్ లో ప్రేక్షకులకు అందరికన్నా కూడా శివాజీకి ఎక్కువ పాపులారిటి ఉండదం. కాగా ప్రేక్షకులు మొదటి వారమే ఎలిమినేట్ అవ్వచ్చు అనుకునింది కామనర్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ ని. అయితే పేరుకు తగ్గట్టుగానే ఉల్టా పుల్తాగా జరిగిన ఈ సీజన్ లో చివరికి అందరినీ ఆశ్చర్యపరుస్తూ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. అమర్ దీప్ రన్నర్ గా నిలవగా శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

కానీ చాలామంది ప్రేక్షకులు విన్నర్ విషయంలో సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ విన్నింగ్ పై పలువురు మోసం జరిగిందంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ కామెంట్స్ పై శివాజీ స్పందిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

శివాజీ షేర్ చేసిన వీడియోలు మాట్లాడుతూ.. “బిగ్‌బాస్ షో మేనేజ్మెంట్ నన్ను పక్కన పెట్టి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని విన్నర్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ అక్కడ జరగలేదు అంతేకాదు నేను వాటిని నమ్మను కూడా. బిగ్‌బాస్ వారు ఓటింగ్ ఫార్మాట్ తోనే వారి సీజన్ విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. అలాగే ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించారు. అందుకుని నేను విన్నర్ ఎవరో తెలుసాకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. షో స్టార్టింగ్ లో ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకటి అనుకున్నాను. ఇలాంటి ఒక కామన్ మెన్  టైటిల్ సాధిస్తే చాలా బాగుటుంది అనుకున్నాను. ఎందుకంటే నేను నేను కూడా రైతు కుటుంబానికి చెందిన వాడినే. యావర్ కూడా ఒక కామన్ మ్యాన్ గానే వచ్చాడు. అందుకే మాకు స్నేహం కుదిరింది. నా వరకు అయితే నాకు గేమ్ ప్లాన్స్ ఏమీ లేవు” అని క్లారిటీ ఇచ్చారు శివాజీ.

ఇక ఇదే వీడియోలో మాట్లాడుతూ తన వెనక బలంగా నిలిచిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. వారిని తప్పకుండా త్వరలోనే కలుసుకుంటాను అని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే, విజేతగా నిలిచిన ప్రశాంత్ పై నిన్న సోమవారం పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఫినాలే షూటింగ్ అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సహంతో అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని శ్రీ కారుల పై దాడికి పాల్పడి సైకోల లాగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ప్రభుత్వ బస్సులను కూడా నాశనం చేశారు. దాంతో ప్రశాంత్, అతని ఫ్యాన్స్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ దాడికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..

Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News