Sensational Murder: శ్రద్ధ కంటే భయంకర హత్య.. విశాఖపట్నం డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ ముక్కలు!

Sensational Murder Than Shraddha Walker: శ్రద్దా వాకర్ హత్య కేసు ఒక పక్క వణుకు పుట్టిస్తోండగా అంతకు మించిన సంచలనమైన కేసులు తెర మీదకు వస్తున్నాయి, అది కూడా ఇప్పుడు ఏపీలో ఒక కేసు టెన్షన్ పెడుతోంది. 

Last Updated : Dec 5, 2022, 05:11 PM IST
Sensational Murder: శ్రద్ధ కంటే భయంకర హత్య.. విశాఖపట్నం డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ ముక్కలు!

Murder Like Shraddha Walker Came into Light in Vishakapatnam: దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున శ్రద్ధ వాకర్ అనే యువతిని హత్య చేసి 35 ముక్కలుగా నరికి ఆ ముక్కలను ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అడవుల్లో ఆమె లివింగ్ రిలేషన్ షిప్ పార్ట్నర్ ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా 0విసిరిన కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అలాంటి ఏదో ఒక కేసు అనునిత్యం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా ఇలాంటి దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో వెలుగులోకి రావడం తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది.

విశాఖపట్నంలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోని డ్రమ్ములో కుళ్ళిపోయిన స్థితిలో ఒక మహిళ మృతదేహం లభ్యం అయింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే మధురవాడ దివ్యాంగుల కాలనీలో ఒక కొండపై నివసిస్తున్న కుటుంబం చాలా కాలం నుంచి కనిపించడం లేదు. వాస్తవానికి ఆ ప్రాంతంలో కూలి పనులు చేసుకునే వారే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అయితే ఆ ఇంటిని అద్దెకి తీసుకున్న వ్యక్తి భార్య గర్భవతి కావడంతో ఆ కుటుంబం సరిగా ఇంట్లో ఉండడం లేదని చెబుతున్నారు.

దాదాపుగా ఏడాది పైనుంచి ఆ ఇంటికి తాళం వేసి ఉందని, పైగా అద్దె కూడా సరిగా కట్టడం లేదనే ఉద్దేశంతో ఇంటి యజమాని వెళ్లి ఆ ఇంటిని ఓపెన్ చేసి చూడడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున దుర్వాసన వచ్చిందని తెలుస్తోంది. ఆ దుర్వాసన అక్కడే ఉన్న ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో నుంచి వస్తుందనే విషయం అర్థం చేసుకుని అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అందులో ఒక మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.

దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విశాఖపట్నం నార్త్ ఏసీపీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పరిస్థితి చూస్తే ఏడాదిన్నర క్రితమే  సదరు మహిళను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సదరు మహిళను భర్త హత్య చేసి ఉంటారని కూడా వారు అనుమానిస్తున్నారు.

జూన్ 2021లో, అద్దెకు ఉన్న వ్యక్తి తన భార్య గర్భం దాల్చిందని పేర్కొంటూ అద్దె బకాయి చెల్లించకుండానే ఇంటిని ఖాళీ చేయడానికి ప్రయత్నించారని, ఓనర్ అద్దె చెల్లించి సామాన్లు తీసుకు వెళ్లాలని చెప్పడంతో అప్పటికి వెళ్లిపోయి మరోమారు వెనుక తలుపు ద్వారా ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే యజమానికి ఇంకా డబ్బు చెల్లించలేదని పోలీసులు చెబుతున్నారు. ఏడాదికి పైగా నిరీక్షించిన తర్వాత ఇంటి యజమాని ఇంటి తాళం పగులగొట్టి సామాన్లు తెరిచి చూడగా.. డ్రమ్ములో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయని తెలుస్తోంది. 
Also Read: Prudhvi Raj: 30 ఇయర్స్ పృధ్వీరాజ్ సూసైడ్ అటెంప్ట్.. అసలు విషయం బయట పెట్టాడుగా!

Also Read: SSMB 28 : మహేష్ సినిమాకు కొత్త కష్టం... టీమ్ అంతా దుబాయ్ హోటల్లో చర్చలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 
 

Trending News