Gold Price Today 18th December 2020: బంగారం ధరలు మళ్లీ జంప్.. షాకిచ్చిన వెండి!

Gold Price Today 18th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్థిరంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇటీవల రూ.50 వేల మార్క్ చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు జంప్ అయ్యాయి.

Last Updated : Dec 18, 2020, 07:23 AM IST
  • బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు
  • పసిడి దారిలోనేయ పనియనిస్తున్న వెండి
  • తాజాగా రూ.70 వేల మార్క్ చేరిన వెండి ధర
Gold Price Today 18th December 2020: బంగారం ధరలు మళ్లీ జంప్.. షాకిచ్చిన వెండి!

Gold Price Today 18th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్థిరంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇటీవల రూ.50 వేల మార్క్ చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు జంప్ అయ్యాయి. మరోవైపు వెండి ధర మరోసారి భారీగా పెరిగి రూ.70 వేల మార్క్ చేరుకుంది.

Also Read: Air India 50 Percent Discount: ఎయిరిండియా శుభవార్త.. వారి టికెట్లపై 50శాతం డిస్కౌంట్

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.50,600 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై సైతం అంతే పెరిగింది. తద్వారా 10 గ్రాముల బంగారం ధర రూ.46,400కి చేరింది.

Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price in Delhi) మరోసారి పుంజుకున్నాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.210 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.52,960కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.410 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,760కి ఎగసింది.

Also Read: Yearender 2020: భారత్‌లో ఈ ఏడాది చైనాయేతర మొబైల్స్ హవా

నవంబర్ నెలలో భారీగా తగ్గిన వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో డిసెంబర్‌లో పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా మూడో రోజు వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. తాజాగా రూ.1,400 మేర పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.70 వేల మార్క్ చేరుకుంది. తాజాగా రూ.1,700 మేర పెరిగింది. దీంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.70,600 అయింది.  

Also Read: Postal Life Insurance Benefits: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కలిగే ప్రయోజనాలివే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News