ఏపీకి నిధులు రావాలంటే ఒకే ఒక్క మార్గం !

ఏపీకి నిధుల రావాలంటే..టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఒక్కటే మార్గమని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు.

Last Updated : Feb 22, 2018, 07:10 PM IST
ఏపీకి నిధులు రావాలంటే ఒకే ఒక్క మార్గం !

ఏపీకి నిధులు విడుదల చేయడంలో కేంద్రం జాప్యం చేస్తున్న నేపధ్యంలో రాజకీయపార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి నిధులు రావాలంటే టీడీపీ బీజేపీలో విలీనం చేయడం ఒక్కటే మార్గమని చెప్పారు వైసీపీ నేత కొడాలి నాని. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖరలు సమావేశంలో ఆయన మట్లాడుతూ టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే నిధులు రావడం ఖాయమని వ్యగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి నిధులు రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు  కేంద్రానికి భజన చేసిన చంద్రబాబు ..ఇప్పుడు ఏదో చేస్తున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు.  ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తానడం... ఎన్డీయే సర్కా్ర్ పై అవిశ్వాస తీర్మానం పెడతానంటూ జగన్ చేసిన ప్రకటనలు విన్న తర్వాత చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కొడాలి నాని విమర్శించారు.

Trending News