బెజవాడలో ఓటర్లు అనూహ్య నిర్ణయం; పోలింగ్ బూత్ కు తాళం వేసిన వైనం

బెజవాడలోని మొగల్రాజపురంలో ఈవీఎంలు మొరాయించడంతో ఎన్నికలకు అంతరాయం ఏర్పడింది

Last Updated : Apr 11, 2019, 11:14 AM IST
బెజవాడలో ఓటర్లు అనూహ్య నిర్ణయం; పోలింగ్ బూత్ కు తాళం వేసిన వైనం

బెజవాడలో ఓటర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈవీఎంలు మోరాయించడంతో అసహనానికి గురైన ఓటర్లు ఏకంగా పోలింగ్ బూత్ కు తాళం వేశారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో అధికారులు తలలు పట్టుకున్నారు. నగరంలోని మొగల్రాజపురం 4వ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది

ఈవీఎం మిషన్లు మొరాయించడంతో ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కాలేదు. ప్రిసైడింగ్ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించినా.... సకాలంలో ఆల్టర్‌నేట్ ఈవీఎంలు పోలింగ్ బూత్ కు చేరలేదు. ఉదయం 7 గంటల నుంచి గంటల తరపడి వేచి విసిగి పోయిన ఓటర్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

తాజా ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ పోలింగ్ కేంద్రానికి కొత్త ఈవీఎం మెషీన్లను పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అవసరమైతే సాయంత్రం మరో గంట పాటు పోలింగ్ సమయాన్ని పెంచుతామని అధికారులు ప్రకటించారు.

Trending News