50 మంది స్టూడెంట్స్‌తో కల్వర్ట్‌లోకి బోల్తా కొట్టిన స్కూల్ బస్

50 మంది స్టూడెంట్స్‌తో కల్వర్ట్‌లోకి బోల్తా కొట్టిన స్కూల్ బస్

Last Updated : Jan 28, 2019, 05:58 PM IST
50 మంది స్టూడెంట్స్‌తో కల్వర్ట్‌లోకి బోల్తా కొట్టిన స్కూల్ బస్

గుంటూరు: 50 మంది విద్యార్థిని, విద్యార్థులను పాఠశాలకు తీసుకుని వెళ్తున్న ఓ స్కూల్ బస్సు మార్గం మధ్యలో అదుపుతప్పి కల్వర్ట్‌లోకి దూసుకుపోయిన ఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వాగు వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 20 మంది వరకు గాయపడగా వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. మాచర్లలోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఉప్పలపాడు గ్రామం నుంచి మాచర్ల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన మరో వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బస్సు డ్రైవర్ కాస్త పక్కకు తిప్పగా బస్సు ఆ పక్కనే వున్న వాగులో పడిపోయింది. 

స్వల్పగాయాలతో బయటపడిన వారిని మాచర్ల ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్ బస్ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Trending News