కేసీఆర్‌తో లింక్ పెడుతూ జగన్ పై విమర్శలు సంధించిన లోకేష్

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినే జగన్ పై నారా లోకేష్ తీవ్ర స్థాయలో విరుచుకుపడ్డారు

Last Updated : Mar 28, 2019, 01:41 PM IST
 కేసీఆర్‌తో లింక్ పెడుతూ జగన్ పై విమర్శలు సంధించిన లోకేష్

తూ.గో: తెలంగాణ కేసీఆర్ తో లింక్ పెడుతూ వైసీపీ  అధినేత జగన్ పై నారా లోకేష్ విమర్శలు సంధించారు. అనపర్తి నియోజకవర్గంలో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రయోజనాలను విషయంలో ప్రతి సారి తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుతగులుతున్నారని..పోలవరాన్నికూడా అడ్డుకోవాలని ప్రయత్నించారని విమర్శించారు. ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా నడుచుకుంటున్న కేసీఆర్ తో జగన్ దోస్తీ చేయడం దారుణమన్నారు. కేసీఆర్ తో దోస్తీ చేసి జగన్ ఆంధ్రుల గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఒక వేళ వైసీపీ గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం కేసీఆర్ కు సామంత రాజ్యంగా మారుతుందన్నారు

ఈ సందర్భంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను లోకేష్ గుర్తు చేశారు. ప్రతి వర్గానికి న్యాయం చేసేలా పథకాలు అమలు చేస్తున్నామన్నారు.చంద్రబాబు వల్లే రాష్ట్రంలో 24  గంటల విద్యుత్ సరఫర జరుగుతుందన్నారు. పండగలకు ప్రతి వర్గానికి కానుకలు ఇస్తున్నామన్నారు. పేదలు,కార్మికుల కోసం రూ.5 కే భోజనం ఇస్తున్నామన్నారు. అనపర్తి నియోజకవర్గంలో 120 కి.మీ రోట్లు వేయించామని నారా లోకేష్ పేర్కొన్నారు

Trending News