వైసీపీ ర్యాలీలో అపశృతి; గోడ కూలి ఒకరి మృతి,  10 మందికి గాయాలు

                      

Last Updated : Mar 27, 2019, 07:29 PM IST
వైసీపీ ర్యాలీలో అపశృతి; గోడ కూలి ఒకరి మృతి,  10 మందికి గాయాలు

తూర్పు గోదావరి జిల్లా మండపేట వైసీపీ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. సభా ప్రాంగణం సమీపంలో పాత భవనం పిట్ట గోడ కూలడంతో 11 మందికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను వైసీపీ కార్యకర్తలు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతు పిల్లి రాములమ్మ అనే మహిళ మృతి చెందినట్లు సమాచారం.

ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. బాధితులను మెరుగైన వైద్య సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో కల్వాపూర్ సెంటర్ లోని ఓ పాత షాపింగ్ కాంప్లెక్స్ పిట్టగోడ కూలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సరిగ్గా జగన్ ప్రసంగిస్తున్న సమయంలో గోడ కూలడం గమనార్హం. 

Trending News