AP Corona Update: ఏపీలో వరుసగా మూడవ రోజు గణనీయంగా తగ్గిన కేసులు

AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. వరుసగా మూడవరోజు కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. అటు డిశ్చార్జ్ రేటు కూడా పెరుగుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2021, 08:42 PM IST
AP Corona Update: ఏపీలో వరుసగా మూడవ రోజు గణనీయంగా తగ్గిన కేసులు

AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. వరుసగా మూడవరోజు కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. అటు డిశ్చార్జ్ రేటు కూడా పెరుగుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణకై వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూతో సత్ఫలితాలు కన్పిస్తున్నాయి. ఏపీలో వరుసగా మూడవ రోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. గత 24 గంటల్లో ఏపీలో 79 వేల 564 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 13 వేల 756 మందికి పాజిటివ్‌గా తేలింది. అటు 20 వేల 392 మంది డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్ కేసులకు, రికవరీ కేసులకు మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14 లక్షల 87 వేల 382 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటి వరకూ 1 కోటి 90 లక్షల 88 వేల 611 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1 లక్షా 73 వేల 622 యాక్టివ్ కేసులున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 2 వేల 301 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1397, చిత్తూరులో 2 వేల 155, అనంతపురంలో 1224 కేసులు, విశాఖపట్నంలో 1 వేయి 4 కేసులు నమోదు కాగా..గత 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 20 మంది, చిత్తూరులో 13, విశాఖపట్నంలో 10, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో 9 మంది మరణించారు. 

Also read: AP Curfew: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి , మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడిగించే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News