బీజేపీకి టీడీపీ సవాల్ ; ఒక్కరు గెలిచినా భారీ గిఫ్ట్ ఇస్తామని ప్రకటన

                   

Last Updated : Mar 27, 2019, 08:34 PM IST
బీజేపీకి టీడీపీ సవాల్ ; ఒక్కరు గెలిచినా భారీ గిఫ్ట్ ఇస్తామని ప్రకటన

ఏపీ బీజేపీకి టీడీపీ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీజేపీని జనాలు దారుణంగా అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీకి గెలుపు కాదు కదా.. డిపాజిట్లు కూడా గల్లంతు అవతాయన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఒక్కరు గెలిచినా రూ.15లక్షలిస్తానని ప్రకటించారు. 

కన్నాకు డిపాటిట్ రాదు...
నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగుతున్న  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిపాజిట్ సాధిస్తే రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. చచ్చిపోయిన పార్టీలో ఏముంటుందని ప్రశ్నించారు. తన డబ్బులు ఎటూ పోవనే నమ్మకంతోనే సవాల్ చేస్తున్నట్టు కుటుంబరావు పేర్కొన్నారు.

బీజేపీ కంటే పాల్ పార్టీ బెటర్..
ఏపీని మోసం చేసిన బీజేపీ అంటే జనాలు మండిపడుతన్నారని కుటుంబరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ కంటే కేఏ పాల్ స్థాపించిన ప్రజా శాంతి పరిస్థితి బెటర్ గా ఉందని...బీజేపీ కంటే కేఏ పాల్‌పైనే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని కుటుంబరావు ఎద్దేవ చేశారు

Trending News