రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీని ప్రశ్నించిన చంద్రబాబు

                                  

Last Updated : Mar 29, 2019, 07:21 PM IST
రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీని ప్రశ్నించిన చంద్రబాబు

ఏపీలో పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెస్తారు.  రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మీరు  ఇక్కడి ఎందుకొచ్చారు ...? అంటూ ప్రధాని మోడిని ప్రశ్నించారు. విభజన తాలూకు గాయాలు ఇంకా మానలేదు..ఇంకా గాయపర్చాలని రాష్ట్రానికి వచ్చారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

టి.సర్కార్ మోసం చేసింది...
మేం ఏం అన్యాయం చేశామని ఏపీ పట్ల మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు...మేం ఈ దేశంలో పౌరులం కాదా ? కేంద్రానికి  మేం పన్నులు కట్టడం లేదా? అంటూ చంద్రబాబు అవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించకపోయినా.. తెలంగాణ ఇవ్వాల్సిన లక్ష కోట్ల వాటా ఇవ్వకపోయినా ప్రజల సహకారంతో మేం పుంజకుంటున్నామని చంద్రబాబు అన్నారు..

చౌకీదార్ కాదు.. అవీనితిపరులకు కాపలాదారుడు
ప్రధాని మోడీ తాను చౌకీదార్ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు...వాస్తవానికి ఆయన అవినీతిపరులకు కాపలాదారుడు. నీతిపరులను వెంటాడే ఈ నరేంద్ర మోదీ ఓ పనికిరాని వ్యక్తి అంటూ చంద్రబాబు తీవ్ర ఆరోపణలకు దిగారు
 

Trending News