కరోనా కల్లోలం.. ఏపీలో తాజాగా ఇద్దరు మృతి

రికవరీ అధికంగానే ఉన్నా భారీగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో తాజాగా 199 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం 1,290 మంది చికిత్స పొందుతున్నారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Jun 7, 2020, 04:38 PM IST
కరోనా కల్లోలం.. ఏపీలో తాజాగా ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల (CoronaVirus) రికవరీ అధికంగానే ఉన్నా భారీగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో తాజాగా 199 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4659కు చేరింది. తాజాగా ఇద్దరు వ్యక్తులు కరోనాతో చనిపోయారు. కోవిడ్19 (COVID-19) మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో ఒక్కరు, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. . దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 75కి చేరింది. కరోనాతో హైదరాబాద్‌లో జర్నలిస్ట్ మృతి

గడిచిన 24 గంటల్లో ఏపీలో 17,695 శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్రంలో ఉన్నవారిలో 130 కేసులు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 69 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో చికిత్స అనంతరం 2,382 మంది డిశ్ఛార్జ్‌ కాగా, ప్రస్తుతం 1,290 మంది చికిత్స పొందుతున్నారు. అందాల నటి కల్పిక గణేష్ Photos

విదేశాల నుంచి వచ్చిన వారిలో 131 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, ఇందులో కరోనా నుంచి అయిదుగురు కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 810 మందికి కరోనా పాజిటివ్‌ తేలగా, ప్రస్తుతం 508 యాక్టీవ్‌ కేసులున్నాయి. తాజాగా 28 మంది డిశ్ఛార్జ్ అయ్యారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

 

Trending News