Heat Waves Alert: నిప్పుల కొలిమిగా మారుతున్న ఆంధ్రప్రదేశ్, ఇవాళ 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత

Heat Waves Alert: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడ్రోజులు మిశ్రమ వాతావరణం కన్పించనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరవచ్చు. మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2024, 08:01 AM IST
Heat Waves Alert: నిప్పుల కొలిమిగా మారుతున్న ఆంధ్రప్రదేశ్, ఇవాళ 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత

Heat Waves Alert: ఏపీలో బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న మూడ్రోజులు ఎండల తీవ్రత భారీగా పెరగనుందని అంచనా వేసింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగనున్నాయి. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ నిప్పుుల కొలిమిలా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువవుతుండగా రానున్న మూడ్రోజులు పరిస్థితి మరింత భయంకరంగా ఉండవచ్చని తెలుస్తోంది. వచ్చే మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీలకు చేరుకోవచ్చని, ఫలితంగా వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. 

ఏపీలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న మంగళవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కొవిలంలో అత్యధికంగా 45.4 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45.2 డిగ్రీలు, అనకాపల్లిలో 45.1 డిగ్రీలు, పార్వతీపురంలో 44.4 డిగ్రీలు, నంద్యాలలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

ఇవాళ రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 175 మంజలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వీలైనంతవరకూ ఉదయం 11 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 18, విజయనగరం జిల్లాలో 18, పార్వతీపురం జిల్లాలో 12, విశాఖపట్నంలో 2, అనకాపల్లిలో 2, కాకినాడలో 2, మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదముందని ఐఎండీ తెలిపింది. ఇక శ్రీకాకుళం జిల్లాలో 11, విజయనగరం జిల్లాలో 6, పార్వతిపురం మన్యం జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12, విశాఖపట్నంలో 3, అనకాపల్లిలో 15, కాకినాడలో 15, తూర్పు గోదావరి జిల్లాలో 18, పశ్చిమ గోదావరి జిల్లాలో 18, ఏలూరులో 13, కృష్టా జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 15, పల్నాడులో 22, బాపట్లలో 2, ప్రకాశం జిల్లాలో 8 మండలాల్లో ఇవాళ వడగాలులు వీయనున్నాయి. 

మరోవైపు రాయలసీమపై నిన్నటి నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రానున్న మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 

Also read: Air Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News